సీఎం జగన్​ క్యాంపు ఆఫీసుకు దగ్గర్లోనే ఈ దారుణం జరిగింది: పంచుమర్తి అనూరాధ

  • రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారా?
  • మహిళలను వేధించిన వైసీపీ నేతలు రోడ్లపైనే తిరుగుతున్నారు
  • ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన చినకాకాని ఘటనే
రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందే తప్ప, మహిళలను వేధించిన వైసీపీ నేతలు మాత్రం రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయని, ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన చినకాకాని ఘటనేనని విమర్శించారు. సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు దగ్గర్లోనే ఈ దారుణం జరిగిందని ధ్వజమెత్తారు.

Panchumarthi Anuradha
Telugudesam
Jagan
cm camp office
gang rape

More Telugu News